మేడ్చల్ జిల్లాలో షాకింగ్ యాక్సిడెంట్.. వీడియో వైరల్..

ఈరోజుల్లో మితిమీరిన వేగంతో కార్లు నడుపుతూ చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు.రాష్‌ డ్రైవింగ్ చేయవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా వారు మాత్రం వినడం లేదు.

ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ చివరికి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.తాజాగా తుర్కపల్లి-మజిదుపూర్‌ ( Turkapalli-Majidupur )మార్గంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.మేడ్చల్ జిల్లా సమీర్ పేట్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఇద్దరు యుక్త వయసులో ఉన్న వ్యక్తులు మృతి చెందారు.ఉజ్వల భవిష్యత్తు ఉన్న వాళ్లు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. """/" / పోలీసులు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టారు.

వారు చెప్పిన ప్రకారం, హకీంపేట్( Hakimpet ) కు చెందిన శేఖర్ మోహన్ వాలే( Shekhar Mohan Wale ), మౌలాలి ప్రాంతానికి చెందిన మలావత్ దీపిక కలిసి ఓ ఇన్నోవా కారులో హైదరాబాద్ బయలుదేరారు.

ఆ సమయంలో మోహన్ కారు డ్రైవ్ చేశాడని తెలిసింది.అతను ఈ కారును అత్యంత వేగంతో నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

వీళ్ళు కారులో డివైడర్ పక్కనే చాలా వేగంగా వెళుతూ ఉండగా కంట్రోల్ తప్పింది.

అంతే కారు డివైడర్ ను మెరుపు వేగంతో వచ్చి ఢీ కొట్టింది.దాని తర్వాత అది అపోసిట్ వేలో వస్తున్న బస్సుకు కూడా బలంగా డాష్ ఇచ్చింది.

ఈ ఘటనలో ఇద్దరు మృతి అక్కడికక్కడే చనిపోయారు. """/" / మోహన్ కారు ప్రమాదం తర్వాత బయటపడ్డాడు.

అదే సమయంలో అతడి వెనకాలే వస్తున్న బస్సు చక్రాలు అతడి పైనుంచి వెళ్లాయి.

ఓ ఫార్మా కంపెనీ తొక్కేసుకుంటూ వెళ్లడం మనం వీడియోలో చూడవచ్చు.ఈ ఘటన తర్వాత ఆ ఫార్మా కంపెనీ బస్సు రోడ్డు( Pharma Company Bus Road ) పక్కకు దూసుకెళ్లింది.

ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న పది మంది వరకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.ఒక కారులోని డాష్ డామ్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

దీన్ని చూసే చాలా మంది షాక్ అవుతున్నారు."అతి వేగం ప్రమాదకరం, వేగంగా వెళ్లాలని అనిపించినా ప్రాణాల మీద తీపి ఉన్నవారు అలా ఎప్పుడూ చేయకూడదు, సొంత ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాహనాలను నడపాలి.

" అని సలహా ఇస్తున్నారు.

రెండు వాషుల్లో చుండ్రు మొత్తం పోవాలా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!