కాంగ్రెస్ పార్టీకి షాక్.. కేంద్ర మాజీ మంత్రి మిలింద్ రాజీనామా..!

కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.మహారాష్ట్రలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా రాజీనామా చేశారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్న మిలింద్ దేవరా ఇవాళ సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

సుమారు 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఇవాళ్టితో తెగిపోయిందని తెలిపారు.

తాను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశానని,తన రాజకీయ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు12, సోమవారం 2024