జేమ్స్ సినిమాలో పునీత్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఇతనే.. బాధగా ఉందంటూ?

పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి సినిమా జేమ్స్ మార్చి నెల 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

మార్చి 17వ తేదీ పునీత్ పుట్టినరోజు కావడంతో సినిమాను ఆరోజే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానులను, ఆయన కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెట్టింది.

ఈ నెల 26వ తేదీన పునీత్ చివరి సినిమా జేమ్స్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే జేమ్స్ సినిమాలోని పాత్రకు పునీత్ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పలేదు.ప్రస్తుతం పునీత్ అన్న శివరాజ్ కుమార్ ఆ పాత్రకు డబ్బింగ్ చెబుతుండటం గమనార్హం.

ఎంతోమందిని పరిశీలించిన చిత్రబృందం చివరకు ఈ సినిమాకు శివరాజ్ కుమార్ తో డబ్బింగ్ చెప్పిస్తుండటం గమనార్హం.

శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం గురించి మాట్లాడుతూ జేమ్స్ మూవీలోని సీన్లకు తాను డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని పునీత్ తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ ను చూడటం తనకు కష్టంగా అనిపించిందని శివరాజ్ కుమార్ అన్నారు.

"""/"/ తన డబ్బింగ్ పునీత్ పాత్రకు ఎలా ఉంటుందో చూడాలని జేమ్స్ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలని పునీత్ రాజ్ కుమార్ వెల్లడించారు.

జేమ్స్ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా నటించారు.రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించడం గమనార్హం.

"""/"/ ఒకే సినిమాలో ముగ్గురు అన్నాదమ్ములు కనిపించడం, పునీత్ కు ఇదే చివరి సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రిలీజైన తర్వాత ఆరురోజుల పాటు కర్ణాటకలో మరే సినిమా ప్రదర్శించకూడదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు.

చేతన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పునీత్ భార్య ఈ సినిమాను నిర్మించారు.

Viral Video: ఫొటో తీసేందుకు ఎన్‌క్లోజర్‌ లోకి చేయి పెట్టిన ఘనుడు.. చివరికి..?!