రాజశేఖర్ రెండో కూతురి ఎంట్రీ ఫిక్స్.. ఫస్ట్ లుక్ అదిరింది!
TeluguStop.com
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో ఎలాంటి కమ్ బ్యాక్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే.
ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో అక్కడి నుండి చాలా సెలెక్టివ్గా చిత్రాలను ఎంపిక చేస్తూ దూసుకుపోతున్నాడు.
కాగా ఆయన కూతుళ్లు శివాత్మిక, శివాని రాజశేఖర్ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే శివాత్మిక దొరసాని చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయినా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది.
ఇక రాజశేఖర్ రెండో కూతురు శివానీ రాజశేఖర్ ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా, చడీచప్పుడు కాకుండా షూటింగ్ను ముగించేందుకు రెడీ అయ్యింది.
కాగా తాజాగా శివానీ పుట్టినరోజున పురస్కరించుకుని శివానీ రాజశేఖర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
‘అద్భుతం’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ అనే పాత్రలో శివానీ నటిస్తోంది.
పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో శివానీ మనకు కనిపించనుంది.ఈ పోస్టర్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శివానీ సక్సెస్ కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాలో బాలనటుడిగా మెప్పించిన తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.పెళ్లిగోల అనే వెబ్సిరీస్ను తెరకెక్కించిన మల్లిక్ రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి రాజశేఖర్ రెండో కూతురు ఎలాంటి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
రెండు రోజులపాటు మేడారం సమ్మక్క -సారమ్మల దర్శనం బంద్