కోట్లు ఖర్చు చేసి శేఖర్‌ కమ్ముల దాన్ని పక్కకు పెట్టేశాడట.. కారణం ఇదేనా?

రెండేళ్ల క్రితం వచ్చిన 'ఫిదా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా దర్శకుడు శేఖర్‌ కమ్ముల వెంటనే కొత్త సినిమాను మొదలు పెట్టలేదు.

అందుకు కారణం ఏంటీ అనే విషయంపై ఆయన స్పందించలేదు.దాదాపు సంవత్సరం గ్యాప్‌ తీసుకున్న తర్వాత శేఖర్‌ కమ్ముల ఒక డాన్స్‌ ప్రధానంగా సాగే మూవీని తెరకెక్కించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి, అందుకోసం నటీ నటుల ఎంపిక కార్యక్రమాన్ని కూడా చేశాడు.

దానయ్య కొడుకు ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

ఏషియన్‌ డిస్ట్రిబ్యూటర్‌ సునీల్‌ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కావాలనుకున్నాడు.సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

కొన్ని సీన్స్‌ చిత్రీకరణ చేయడం కూడా జరిగింది.సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌, ఆడిషన్స్‌కు అంటూ దర్శకుడు శేఖర్‌ కమ్ముల కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు సినిమాను అటకెక్కించాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్‌ కమ్ముల ఆ సినిమా ఔట్‌ పుట్‌ పట్ల సంతృప్తిగా లేడని, దాంతో సినిమాను పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.

"""/"/ ఆ సినిమాను పక్కకు పెట్టిన శేఖర్‌ కమ్ముల తాజాగా నాగచైతన్యతో సినిమాను ప్రకటించాడు.

త్వరలోనే సినిమాను ప్రారంభించి వెంటనే సినిమాను షూటింగ్‌ కూడా మొదలు పెట్టబోతున్నాడు.ఇక ఈ చిత్రంను ఇదే సంవత్సరంలో విడుదల చేయాలని కూడా శేఖర్‌ కమ్ముల భావిస్తున్నాడు.

ఈ చిత్రానికి ఏషియన్‌ సునీల్‌ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.చైతూ మూవీ అయిన తర్వాత మళ్లీ ఆ డాన్స్‌ నేపథ్యంలోని మూవీని శేఖర్‌ కమ్ముల రీ స్టార్ట్‌ చేస్తాడేమో చూడాలి.

అమెరికాపై అభిమానం చాటుకున్న ఎన్ఆర్ఐ కుటుంబం .. భారత్‌లోని ఇంటిపై ‘‘ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ’’