ఆ కారణంతోనే సినిమా ఫంక్షన్లకు వెళ్లడం మానేశా… జగపతిబాబు కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జగపతిబాబు ఇండస్ట్రీలోకి వచ్చే సుమారు 35 సంవత్సరాలు అవుతోంది.

జగపతిబాబు కూడా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడానికి కాస్త సమయం పట్టిందని చెప్పాలి.

ఇలా ఈయన ఇండస్ట్రీలో సాధించిన సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువగా వెంటాడాయి.ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలోనే ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇలా విలన్ గా ఎంతో సక్సెస్ అయినటువంటి జగపతిబాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

"""/"/ ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 34 సంవత్సరాలు పూర్తి అయింది.

అయితే అందరిలాగా సినిమాలు మాత్రమే కాకుండా నాకు ఇతర బిజినెస్ లు చేయడం, నలుగురిలో కలవడం తెలీదు, నాకు మాట్లాడటం తెలియదు.

నాకు సినిమా తప్ప మరేమీ తెలియదని తెలిపారు. """/"/ అందరిలాగా తాను ఇప్పుడు కమర్షియల్ గా ఆలోచించి కమర్షియల్ గా బిహేవ్ చేయను బహుశా అందుకే నేను వెనక పడ్డానేమో.

ఇక ఈ మధ్యకాలంలో తాను సినిమా ఫంక్షన్లకు వెళ్లడం కూడా మానేశాను ఎందుకంటే సినిమా ఫంక్షన్లలో వేదికపై అందరిని పొగిడి పొగిడి అలసిపోయాను.

వేదికపై అందరిని తోసుకుంటూ వెళ్లి ముందు నుంచోనే అవసరం నాకు లేదు అందుకే సినిమా ఫంక్షన్లకు వెళ్లడం కూడా మానేశాను అంటూ ఈ సందర్భంగా జగపతిబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈశ్వరన్ కేసులో కీలక పరిణామం .. సింగపూర్ వ్యాపారవేత్తపై అభియోగాలు