డ్యాన్స్ మాస్టర్ డైరక్షన్ లో శర్వానంద్..!

జాను, శ్రీకారం, మహా సముద్రం సినిమాలు నిరాశపరచగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా అయినా శర్వానంద్ కి సూపర్ సక్సెస్ ఇస్తుందని భావించాడు.

కానీ సినిమాకు టాక్ మాత్రం అంత గొప్పగా ఏమి లేదు.శర్వానంద్ కథల ఎంపిక బాగానే ఉన్నా ఆ సినిమాల విషయంలో డైరక్టర్స్ డీఫాల్ట్ వల్ల ఆ ఎఫెక్ట్ అతని మీద పడుతుంది.

కిశోర్ తిరుమల కూడా ఇదివరకు సినిమాల్లో తను ఎంచుకున్న పాయింట్ ని కరెక్ట్ గా కన్వే చేశాడు.

కానీ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మెలో డ్రామాగా చేశాడు.ఈ సినిమా తర్వాత శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు.ఇదిలాఉంటే ఈ మూవీ తర్వాత శర్వానంద్ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే కథ ఫైనల్ అవగా త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.

ఇదివరకు రాజు సుందరం అజిత్ హీరోగా ఒక సినిమా చేశాడు.ఇక ఇప్పుడు అతని డైరక్షన్ లో శర్వానంద్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

వియత్నాంపై టైఫూన్ యాగి ప్రతాపం.. వాహనాలు వెళ్తుండగానే కూలిన బ్రిడ్జి..