దసరా రేస్.. అక్టోబర్ 14న రాబోతున్న 'మహాసముద్రం'!

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.ఈ మధ్యనే ఆయన చేసిన శ్రీకారం సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'మహాసముద్రం' లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

"""/"/ అయితే ఈ మధ్యనే థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో ఒక్కో సినిమా విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలో మహా సముద్రం సినిమా మేకర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాయి.

ఈ సినిమాను దసరా రేస్ లోకి దింపబోతున్నట్టు తెలిపారు.అక్టోబర్ 14న ఈ సినిమాను వరల్డ్ వైజ్ విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా ఒక గ్లిమ్స్ కూడా విడుదల చేసారు. """/"/ ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

ఈ గ్లిమ్స్ లో శర్వా, సిద్దార్థ్ ఒకరికొకరు గన్ గురిపెట్టుకోగా హీరోయిన్ అతిధి రావు హైదరీ సముద్రంలో సరదాగా గడుపుతూ కనిపించింది.

ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవ్వడం వల్ల మంచి డీల్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మాం నిర్మిస్తున్నారు.

మరి దసరా రేస్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్ అందుకుంటుందో చూడాలి.

కామాఖ్య దేవాలయంలో పూజలు చేసిన హీరోయిన్ సంయుక్త మీనన్.. కారణాలివేనా?