ప్రభుత్వాలు ఒకే అంటున్నా, వారు మాత్రం ఒప్పుకోవడంలేదు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే.మార్చి నుంచి మొదలైన ఈ మహమ్మారి తీవ్రత నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో అన్ని సినిమా,సీరియల్ షూటింగ్ లు నిలిచిపోయిన విషయం విదితమే.

అయితే ఇటీవల లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్ లకు ప్రభుత్వాలు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చాయి.

దీంతో మరికొన్ని రోజుల్లో షూటింగ్స్ ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నారు.ఇప్పటికే మధ్యలో ఆగిపోయిన సినిమాల వల్ల నిర్మాతలపై ఆర్థిక బారం పడుతోంది.

దీంతో త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోవాలనుకుంటున్న వారికి టాలీవుడ్, బాలీవుడ్‌కు హీరోలు, హీరోయిన్ల రూపంలో ఊహించని ట్విస్ట్ వచ్చిపడింది.

కొంతమంది తాము ఇప్పట్లో రాలేమని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారట.వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తమతో పాటు చిత్రయూనిట్‌ను రిస్క్‌లో పెట్టలేమని అంటున్నారు.

ఇప్పటికే టాలీవుడ్‌లో మహేష్ బాబు, నాని కూడా షూటింగ్ లు మొదలైనప్పటికీ ఇప్పటిలో షూటింగ్ రాలేమని చెప్పేశారు.

ఇంకా చాలా మంది అగ్రహీరోలు కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు తాజాగా వీరి బాటలోకే బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది.

షూటింగ్ లు మొదలైనప్పటికీ తాను ఇప్పట్లో అయితే షూటింగ్‌కు వెళ్లనని ఖరాఖండిగా చెప్పేశారు.

అంతేకాదు తన కూతురు హీరోయిన్ శ్రద్దా కపూర్‌ను కూడా పంపనని ఆయన స్పష్టం చేశారు.

బతికేందుకు పని అవసరమని అయితే ప్రాణాలకంటే పని ముఖ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

చాలా మంది షూటింగ్స్ ప్రారంభిస్తామని చెబుతుంటే భయం వేస్తోందని అన్నారు.ఆస్పత్రుల్లో చేరేకంటే ఇంట్లో జాగ్రత్తగా ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదేంది భయ్యా.. కేవలం 10 మీటర్లు దూరం సైకిల్ తొక్కితే రూ. పదివేల బహుమతి.. కాకపోతే కండిషన్స్ అప్లై..