అయ్యప్ప దర్శనం ఆ రెండు మాసాల్లోనే కాదండోయ్..!
TeluguStop.com
శబరిమల అయ్యప్ప దర్శనం అనగానే అందరికీ గుర్తు వచ్చేది నవంబర్, డిసెంబర్ నెలలు.
ఇందుకు ప్రధాన కారణం ఈ మాసాల్లోనే ప్రజలు అయ్యప్ప మాలను ధరిస్తారు.శబరిమలకు మాలధారణతో వెళ్లి ఇరుముడిని సమర్పించి వస్తారు.
అంతేనా మండల పూజతో పాటు సంక్రాంతి రోజు జ్యోతిని కూడా దర్శించుకుంటారు.చాలా మంది ఈ రెండు మాసాల్లో మాత్రమే ఆలయం తెరిచి ఉందనుకుంటారు.
కానీ ఈ రెండ్రోజులే కాదు ఏడాదిలో మరిన్ని రోజుల్లో కూడా ఆలయాన్ని తెరుస్తారు.
శబరిమళ అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి తెరిచారు.భక్తుల కోసం జులై 21 నుంచే రేపటి వరకు పూజలు కొనసాగించునున్నారు.
ఒమిక్రాన్ భయం ఉన్నప్పటికీ.కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువపత్రం, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దర్శన అనుమతి కల్పిస్తున్నారు.
ఇందుకోసం గతంలోనే ఆన్లైన్ టికెట్లు బక్ చేసుకునే వీలు కల్పించారు.సాధారణంగా మలయాళ మాసంలో మొదటి ఐదు రోజులు శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.
"""/" /
కానీ నవంబర్ నుంచి జనవరి దాకానే ఎక్కువ మంది స్వామి వారిని దర్శించుకుంటారు.
తర్వాత ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ప్రతి నెలలో ఐదు రోజులపాటు ఆలయాన్ని తెరుస్తారు.
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఏటా జనవరి నెలలో శబరిమల దేవస్థానం అధికారులు.అధికారిక వెబ్సైట్లో ఆలయం తెరిచే ఉండే రోజులు.
⦁ ఫిబ్రవరి - 12-02-2021 నుంచి 17-02-2021
⦁ మార్చి - 14-03-2021 నుంచి 28-03-2021
⦁ ఏప్రిల్ - 10-04-2021 నుంచి 18-04-2021
⦁ మే - 14-05-2021 నుంచి 19-05-2021
⦁ ప్రతిష్టాపన పూజ మే - 22-05-2021 నుంచి 23-05-2021
⦁ జూన్ - 14-06-2021 నుంచి 19-06-2021
⦁ జులై - 16-07-2021 నుంచి 21-07-2021
⦁ ఆగస్టు - 16-08-2021 నుంచి 23-08-2021
⦁ సెప్టెంబర్ - 16-09-2021 నుంచి 21-09-2021
⦁ అక్టోబర్ - 16-10-2021 నుంచి 21-10-2021.
సెల్ఫీలు అంటూ నడుం పట్టుకుంటారు… రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!