డ్రైనేజీ లేక రోడ్లపై నిలిచిన మురుగు నీరు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని 19వ వార్డులో ముత్యాలమ్మ గుడి బజారులో డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలం వస్తే బురద రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లపై మురికి నిలవడంతో దోమల వ్యాప్తి చెందడం, మురికినీరు దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు ఇంట్లో ఉండలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.

సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

ఆరోగ్యాన్నిచ్చే ఆల్ బుఖారా.. వర్షాకాలంలో దొరికే ఈ పండ్లను మిస్ అయ్యారో చాలా నష్టపోతారు!