తండాల్లో ఎక్సైజ్, ఐడి పోలీసుల వరుస దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొర్రతండా, డాకుతండ, రాధానగర్ తండా, ఆంగోత్ తండా,పోర్లగడ్డ తండాల్లో యాదాద్రి డిపిఓ ఆధ్వర్యంలో రామన్నపేట డిటిఎఫ్,యాదాద్రి,మోత్కూర్, భువనగిరి ఐడి ఎస్ హెచ్ ఓలు బృందాలుగా ఏర్పడి శుక్రవారం 8 గ్రామాల్లో వరుస దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 68 లీటర్ల ఐడి మద్యం,35 కిలోల బెల్లం,2200 లీటర్ల వాష్ ను ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మండల వ్యాప్తంగా సారా తయారీ చేయవద్దని తెలిపామని,అయినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఓజీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ స్టార్ హీరో…