టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంచలనాలు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు.ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య 50కి చేరింది.

వ్యాపం కుంభకోణంలా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు మారుతోంది.ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ లావాదేవీల లెక్క లక్షలు దాటి కోటికి చేరిందని తెలుస్తోంది.

ప్రవీణ్ కుమార్ మొదలు ఈ కేసులో నిందితులు అందరూ డబ్బుపై ఆశతో ఒకరి నుంచి మరొకరు క్వశ్చన్ పేపర్ ను అమ్ముకున్నారని సమాచారం.

ఇందులో భాగంగానే వరంగల్ లోని ఒక పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హైటెక్ కాపీయింగ్ కు పాల్పడ్డారని తెలుస్తోంది.

కాగా ఈ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.