మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు.

నారా లోకేశ్ కు అడ్డు వస్తారనే జూనియర్ ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని ఆరోపించారు.

లోకేశ్ ను ప్రజలపై రుద్ది ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు డీఎన్ఏను నాశనం చేసి రాజకీయ సమాధి కట్టాలని చెప్పారు.బీసీలే ఎన్టీఆర్ డీఎన్ఏ అని, ఏపీలో బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

ఏపీని ఆక్రమించాలని ఒక కులం పన్నాగాలు పన్నుతోందని తెలిపారు.దమ్ము, ధైర్యం ఉన్న సీఎం జగన్ ను కాపాడుకోవాలని వెల్లడించారు.

మీ పిల్లలు వయసు పెరుగుతున్నా బరువు పెరగడం లేదా.. అయితే ఇలా చేయండి!