ఎన్టీఆర్ కూతురు మంచి మనస్సుకు నిదర్శనం ఇదే.. అప్పట్లో అలా చేశారంటూ?

సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి మరణ వార్త తెలిసి ఎన్టీఅర్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు.

అనారోగ్య సమస్యల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే వార్త అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.

అయితే ఉమా మహేశ్వరి చాలా మంచివారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఉమా మహేశ్వరి తన కళ్లను దానం చేశారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అయితే చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీపార్వతి విషయంలో ఆమె వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

సీనియర్ ఎన్టీఆర్ మరణం తర్వాత నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు లక్ష్మీ పార్వతి విషయంలో కఠినంగా వ్యవహరించిన తీరు గురించి అందరికీ తెలిసిందే.

అయితే సీనియర్ ఎన్టీఆర్ మరణించే సమయానికి లక్ష్మీ పార్వతితో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో ఉన్న ఇంటిలో ఉన్నారు.

అయితే ఈ ఇల్లు ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి పేరుపై ఉండేది.ఎన్టీఆర్ పెద్ద కూతురు పురంధేశ్వరి లక్ష్మీ పార్వతిని ఆ ఇంటి నుంచి బయటకు పంపించాలని ప్రయత్నాలు చేశారు.

లక్ష్మీపార్వతిని బయటకు పంపించాలని ఉమా మహేశ్వరిపై పురంధేశ్వరి ఒత్తిడి తెచ్చినా ఉమా మహేశ్వరి మాత్రం లక్ష్మీ పార్వతిని ఆ ఇంటినుంచి వెళ్లిపోవాలని కోరలేదు.

అయితే తర్వాత కాలంలో పవరాఫ్ అటార్నీ ఎన్టీఆర్ కొడుకులలోని ఒకరి పేరుపైకి వచ్చింది.

"""/" / ఆ తర్వాత మాత్రం రోజుల వ్యవధిలోనే లక్ష్మీ పార్వతి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇతరులకు సహాయం చేసే విషయంలో ఉమా మహేశ్వరి ముందువరసలో ఉండేవారని తెలుస్తోంది.ఉమా మహేశ్వరి మరణ వార్త ఆమె కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెడుతోంది.

ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!