నితిన్‌కు విల‌న్‌గా చిరంజీవి హీరోయిన్‌..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ‌కు ఈ యేడాది టైం బాగానే క‌లిసొస్తోంది.

ముందుగా ఫిబ్ర‌వ‌రిలో భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టిన నితిన్ ఓ ఇంటివాడు కూడా అయ్యాడు.

ఈ హుషారులోనే నితిన్ వ‌రుస‌పెట్టి క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు ఓకే చేసేందుకు ప్లానింగ్‌తో ఉండ‌గానే క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే నితిన్ లైన్లో పెట్టిన సినిమాల‌లో బాలీవుడ్ హిట్ మూవీ అంధ‌ధూన్ కూడా ఉంది.

అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ నితిన్ సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాను నితిన్ త‌న శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై సొంతంగా నిర్మిస్తుండ‌గా వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తారు.

బాలీవుడ్ అంధ‌ధూన్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న విల‌న్‌గా సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు న‌టించారు.

ఈ పాత్ర‌ను తెలుగులో చేసేందుకు ముందుగా న‌య‌న‌తార పేరు పరిశీల‌న‌కు రాగా ఆమె రెమ్యున‌రేష‌న్ ఎక్కువుగా ఉండడంతో ఆ త‌ర్వాత ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్ పేర్ల‌ను ప‌రిశీలించారు.

చివ‌ర‌కు ట‌బునే ఇక్క‌డ కూడా న‌టింప‌జేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌నలు, చ‌ర్చ‌లు కూడా వ‌చ్చాయి.

ట‌బు సైతం రెమ్యున‌రేష‌న్ విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ పేరును ఫైన‌లైజ్ చేస్తునట్టు తెలుస్తోంది.

రెండు ద‌శాబ్దాల క్రితం టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన సీనియ‌ర్ హీరోయిన్ రంభ గుర్తుండే ఉంటుంది.

ఆమె చిరంజీవి ప‌క్క‌న హిట్ల‌ర్‌, బావ‌గారు బాగున్నారా సినిమాల్లో త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసింది.

ఇప్పుడు ఆమెనే తెలుగులో ట‌బు రోల్‌కు తీసుకుంటున్నార‌ట‌.ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు గాంధీ రంభ‌ను క‌లిసి క‌థ గురించి చెప్పార‌ని కూడా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నితిన్ ప‌క్క‌న న‌బా న‌టేష్ హీరోయిన్‌.త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

విశ్వం భర సినిమా కోసం భారీ సాహసం చేస్తున్న చిరంజీవి…