నన్ను వదిలి నా బేబీ వెళ్ళిపోయింది.. ఒంటరి వాడినయ్యాను.. నరేష్ ఎమోషనల్ కామెంట్స్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు నరేష్ ( Naresh ) విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోగా నటించారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలలో నిలిచారు.

ముఖ్యంగా ఈయన మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో వార్తలలో నిలిచారు. """/" / ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి సినీనటి పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh ) తో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

అయితే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఎలాంటి అధికారక ప్రకటన లేదు.

ఇక పవిత్ర లోకేష్ తో చాలా సంతోషంగా ఉన్నానని ఇలాంటి వ్యక్తి తన పక్కన ఉంటే మరొకరి కోసం తాను ఎదురు చూడాల్సిన పనిలేదని తెలిపారు.

"""/" / ఇకపోతే తాజాగా నరేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఇందులో భాగంగా నా బేబీ ( Baby ) నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది ఎంత వెతికినా కనిపించడం లేదు.

తాను కనిపించకపోవడంతో ముద్ద కూడా దిగడం లేదని, నా బేబీ లేకపోవడంతో ఒంటరి వాడిని అయిపోయాను అంటూ ఈయన ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేశారు.

దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.కొంపదీసి పవిత్ర లోకేష్ కనక తనని వదిలి వెళ్ళిపోయిందా అని అందరూ భావించారు.

కానీ ఇది నిజం కాదని తాను నటిస్తున్నటువంటి వీరాంజనేయులు విహారయాత్ర.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేశారని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.

అయినా ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు విభిన్న రీతిలో సినిమాలను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

350 సంవత్సరాల తర్వాత.. బ్రిటన్ నుంచి భారత్‌కు చేరిన ఛత్రపతి శివాజీ ‘‘వాఘ్ నఖ్ ’’ ..!!