పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక..: పురంధేశ్వరి
TeluguStop.com
ఏపీ ఎన్నికలకు( AP Elections ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అన్నారు.
ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు.పొత్తులను కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
"""/" /
బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో( BJP Janasena Alliance ) ఉందన్న ఆమె పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.
కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు.రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ, వైసీపీకి నిబద్ధత లేదని తెలిపారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని విమర్శించారు.
వీడియో: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బస్సు.. పెట్రోల్ బంక్ ఉద్యోగిని తొక్కేసింది..?