ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి:శీలం స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించి వెంటనే ఇచ్చిన హామీలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సీనియర్ నాయకులు శీలం స్వామి అన్నారు.

ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించి,వారికిచ్చిన హామీల ప్రభుత్వం నెరవేర్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 20 సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల నాయకులు పాల్గొన్నారు.

కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ఆవిష్కరణ.. అందులోని ఫెసిలిటీస్ చూస్తే ఫిదా..?