జోరుగా టీ.కాంగ్రెస్ రెండోవిడత విజయభేరీ బస్సు యాత్ర

తెలంగాణలో కాంగ్రెస్ రెండో విడత విజయభేరీ బస్సు యాత్ర జోరుగా కొనసాగుతోంది.ఈ మేరకు సంగారెడ్డి, నర్సాపూర్ మరియు మెదక్ లలో కొనసాగబోతుంది.

ఇవాళ్టి ప్రచారంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఖర్గే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం సంగారెడ్డికి రానున్న ఖర్గే అక్కడ కాంగ్రెస్ నిర్వహించే భారీ బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు.

అనంతరం గంజి మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.తరువాత నర్సాపూర్ వెళ్లనున్న ఆయన కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.

సాయంత్రం మెదక్ కు వెళ్లనున్న ఖర్గే అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కథ మారుస్తున్న హరీష్ శంకర్…కారణం ఏంటి..?