ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి డిక్కీ ప్రతినిధులకు సూచించారు.

గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో డిక్కీ ప్రతినిధులలో సమావేశం నిర్వహించారు.

ఎస్సీ, ఎస్టీ ల అభ్యున్నతికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దళిత బంధు, టి - ప్రైడ్, అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ స్కీం , పి ఎం ఈ జి పి వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు.

వీటి గురించి విద్యార్థులకు తెలియజేయాలన్నారు.వారికి ఆసక్తి ఉన్న రంగాలలో రాణించేలా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పారు.

సమాజానికి ఉపయోగడే కొత్త ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర డిక్కీ ప్రెసిడెంట్ దాసరి అరుణ, రాష్ట్ర ఫోటోగ్రఫీ వర్టికల్ హెడ్ శేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా డిక్కీ సమన్వయ కర్త ఎస్ మురళి, రంగారెడ్డి జిల్లా డిక్కీ సమన్వయ కర్త సంతోష్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి వినోద్ కుమార్ , ఎల్ డి ఎం మల్లిఖార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

వీడియో వైరల్: మక్కా క్లాక్ టవర్ పై పిడుగుపాటు..