SBI కస్టమర్లకు షాకింగ్ వార్త… నవంబర్ 15 నుండి మోతమోగిపోనుంది?
TeluguStop.com
భారతీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ ఝలక్ ఇచ్చింది.
అవును, తాజాగా క్రెడిట్ కార్డుకు సంబంధించి 2 కీలక మార్పులు తీసుకువచ్చింది.అదేమంటే, మొదటిది.
EMI లావాదేవీలపై ఇపుడు ఉన్న ప్రాసెసింగ్ ఫీజు రూ.100 వరకు పెంచేసింది.
ఇక రెండోది రెంట్ పేమెంట్పై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు షాక్ ఇచ్చింది.ఇకపోతే ఈ నిబంధనలు నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయని గుర్తు పెట్టుకోండి.
అంటే ఏదైనా వస్తువు మీరు కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం లావాదేవిని EMI లావాదేవీగా మార్చినపుడు రూ.
100 వర్తించే పన్నులు SBI ఇపుడు వసూలు చేస్తోంది.ఇకపోతే నవంబర్ 15 నుంచి ఆ ప్రాసెసింగ్ ఫీజును రూ.
199 వరకు ఛార్జ్ చేయనున్నారు.అలాగే రెంట్ పేమెంట్ లావాదేవీలపై ఇంత వరకు ఎలాంటి ఛార్జ్ వాసులు చేయని SBI ఇకపై రూ.
99+ వర్తించే పన్నులు వసూలు చేయనుంది.అయితే నవంబర్ 15లోపు లావాదేవీలు చేసే వారికి మాత్రం ఈ ఛార్జీలు వర్తించవు అని గుర్తు పెట్టుకోవాలి.
"""/" /
ఇకపోతే ప్రస్తుతం బ్యాంకులు అన్నీ కూడా థర్డ్ పార్టీ పేమెంట్స్ అందిస్తున్న ‘రెంట్పే’ ఆప్షన్పై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ICCI బ్యాంక్ కూడా సదరు లావాదేవీలపై 1% ఫీజు వసూలు చేయనుందనే విషయం విదితమే.
ఈ ఛార్జీలను అక్టోబర్ 20 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే ఆ బ్యాంక్ ప్రకటించడం మనకు తెలిసినదే.
ఈ తరుణంలో తాజాగా SBI సైతం రూ.99+ చొప్పున వసూలు చేయాలని అనుకోవడం కొసమెరుపు.
వాస్తవానికి రెంట్ పేమెంట్, మెయింటనెన్స్ అనేవి పైకి చెప్పే మాటలే.వాస్తవంలో జరిగేది వేరు.
చాలా మంది వినియోగదారులు తమ అవసరాలకు నగదు అవసరం అయినప్పుడు ఈ సేవలను వినియోగించుకుంటున్నారన్నది వాస్తవం.