రుణ గ్రహీతలపై మరింత భారం మోపిన ఎస్బీఐ
TeluguStop.com
ఖాతాదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది.రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ -బేస్డ్ లెండింగ్ రేటును మరోసారి పెంచింది.
ఈ క్రమంలోనే తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 20 బీపీఎస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై మరింత భారం మోపింది.
కాగా సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చింది.బాహ్య బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేటును 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది.
ఆరు నెలల వ్యవధి రుణాల వడ్డీ రేటు 7.45 శాతం నుండి 7.
65 శాతానికి పెరిగింది.సంవత్సర పరిధి లోన్లపై 7.
90 శాతం, రెండేళ్లు, మూడు సంవత్సరాల 8 శాతంగా ఉంచింది.మూడు నెలల్లో మూడో పెంపు ఇది.
ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం ప్రకటించింది.
Tillu Square Movie : టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ సీన్లు అభిమానులకు ఫుల్ కిక్కు ఇవ్వడం ఖాయమా?