ఎల్లారెడ్డిపేట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ కు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా :సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Navuri Venkat Reddy )కి పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఎల్లారెడ్డిపేట ( Yellareddypet )మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వెంకట్ రెడ్డి గత మాసంలో ఉత్తమ జాతీయ అవార్డును ఢిల్లీలో అందుకోగా మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మార్కండేయ దేవాలయంలో వెంకట్ రెడ్డికి పుష్పగుచ్చమిచ్చి శాలువతో సత్కారం చేశారు.

అనంతరం సంఘ సభ్యులు మిటాయి తినిపించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు వనం బొందయ్య,రా పెళ్లి దేవంతం,వనం రాజు,రా పెళ్లి రమేష్,సుంకి భాస్కర్, దోమల భాస్కర్, వనం రామేష్,సుధ ఆర్టిస్ట్, దాస్, సిద్ది రాములు తదితరులు పాల్గొన్నారు.

అయ్యయో.. ఈ కష్టం మరొకరికి రాకూడదుగా.. వీడియో వైరల్