గోవాకి షిఫ్ట్ అవుతున్న సర్కారు టీం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబుకి జోడీగా నటిస్తుంది.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ని పరశురాం దుబాయ్ లో స్టార్ట్ చేశాడు.

షూటింగ్ కి సంబందించిన కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి.అక్కడ బ్యాంక్ నేపధ్యంలో నడిచే యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తుంది.

నిజానికి దుబాయ్ ఎపిసోడ్ అంతా ముందుగా అమెరికాలో ప్లాన్ చేసిన అక్కడ పర్మిషన్ దొరకకపోవడంతో కథలో కొద్దిగా మార్పులు చేసి అమెరికా ప్లేస్ లోకి దుబాయ్ ని తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే దుబాయ్ కి సంబందించిన ఫస్ట్ షెడ్యుల్ పూర్తి కావస్తుందని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో నెక్స్ట్ షెడ్యుల్ కి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే స్టార్ట్ చేయడానికి టైం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

సెకండ్ షెడ్యుల్ ఎపిసోడ్స్ ని గోవా బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే గోవాలో పరశురాం టీం పని మొదలు పెట్టిందని, సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సెట్ ని గోవాలో నిర్మించారని, దానిలోనే మెజారిటీ షూటింగ్ జరుగుతుందని బోగట్టా.

దుబాయ్ షెడ్యుల్ ముగించుకొని నేరుగా టీం మొత్తం గోవా వెళ్ళిపోతుందని, దీనిపై త్వరలో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక మహేష్ కూడా వీలైనంత వేగంగా ఈ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలోనే గ్యాప్ తీసుకోకుండా షెడ్యూల్ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?