సర్కారు నుండి మ.. మ.. మహేషా.. సాంగ్ రాబోతుంది.. ఇక బాక్సులు బద్దలవ్వాల్సిందే..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.

మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవలే ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా నుండి ఇప్పుడు మరొక సాంగ్ రాబోతుంది.ఇక రిలీజ్ కు 6 రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా నుండి ఈ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు.

"""/" / ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్.ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కి అందరు ఫిదా అయ్యారు.

ఈయన వింటేజ్ లుక్ తో మతి పోగొడుతున్నాడు.ఇక ఈ సినిమాలో మహేష్ ఒక మాస్ సాంగ్ కు ఊర మాస్ స్టెప్పులు వేసినట్టు మేకర్స్ చెప్పారు.

మరి ఆ సాంగ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అంతా ఎదురు చూస్తున్నారు.

ఆ తరుణం రానే వచ్చింది. """/" / ఈ సాంగ్ కోసం ఎదురు చూసే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.

ఈ సినిమా లోని మా మా మహేషా.అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ని రేపు శనివారం మే 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఒక కలర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో మహేష్, కీర్తి ఇద్దరు కూడా కలర్ ఫుల్ డ్రెస్ లో మాస్ స్టెప్పులు వేస్తున్నట్టు అనిపిస్తుంది.

పోస్టర్ తోనే అందరూ ఎదురు చూసేలా చేసారు.మరి సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఈ సాంగ్ కు థియేటర్స్ లో బాక్సులు బద్దలవ్వడం ఖాయం లా కనిపిస్తుంది.

పల్నాడు హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ సీరియస్