పెళ్లిలో తులం బంగారంపై సర్కార్ కసరత్తు…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ‘ఇందిరమ్మ కానుక’ అమలుపై కసరత్తు ప్రారంభమైంది.
ఇందులో భాగంగా ఆడపడుచులకు పెళ్లి సమయంలో రూ.లక్ష ఆర్థికసాయం,తులం బంగారం ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కల్యాణలక్ష్మీ స్కీమ్ను ఏటా ఎంతమందికి ఇచ్చారు? వ్యయం ఎంత? అనే వాటిపై సమగ్ర వివరాలను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరింది.
రాబోయే పెళ్లిళ్ల సీజన్లో ఈ స్కీమ్ అమలు చేయనున్నారని సమాచారం.
వరద నీరు పొంగుకొచ్చినా చెక్కుచెదరని ఆలయం… నీటిని దరి చేరనివ్వని ఆలయ కోనేరు!