ట్రైలర్‌ టాక్‌ : కాస్త బ్రేక్‌ తీసుకుని వస్త బొమ్మ దద్దరిల్లడం ఖాయం

మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక వైభవంగా జరిగింది.

ఈ వేడుకలో చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేయించారు.ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది రోజుల నుండి కూడా ట్రైన్‌ ఎపిసోడ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు.

వారి మాట నిజమేనేమో అని ట్రైలర్‌ మొదటి నిమిషంలో వచ్చిన ట్రైన్‌ ఎపిసోడ్‌ సన్నివేశాలు అనిపించేలా చేస్తున్నాయి.

"""/"/భారీ ఎత్తున అంచనాలున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.

ఈసమయంలోనే విడుదలైన ట్రైలర్‌ సినిమా అంచనాలను పీక్స్‌కు తీసుకు వెళ్లింది.ట్రైలర్‌తో సినిమాను చూడాలని భావిస్తున్న వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని చెప్పుకోవచ్చు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రంలో సన్నివేశాలను దర్శకుడు అనీల్‌ రావిపూడి మల్చాడు అంటూ ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది.

ఈ ట్రైలర్‌లో మహేష్‌ బాబు చెప్పిన డైలాగ్‌ కాస్త బ్రేక్‌ తీసుకుని వస్త.

బొమ్మ దద్దరిలుద్ది ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. """/"/కామెడీతో పాటు ఫ్యామిలీ మరియు యాక్షన్‌ సన్నివేశాలు చూస్తుంటే ఇది మహేష్‌ బాబు కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్‌గా నిలవడం ఖాయం అన్నట్లుగా ఉంది అంటూ ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె సీన్స్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉండటం ఈ ట్రైలర్‌లో చూడవచ్చు.

సూపర్‌ స్టార్‌ సినిమాలో లేడీ సూపర్‌ స్టార్‌ ఉండటంతో పాటు బండ్ల గణేష్‌ మరోసారి ఈ చిత్రంతో కమెడియన్‌గా మెప్పించేందుకు సిద్దం అయ్యాడు.

అందుకే ఈ చిత్రం అన్ని విధాలుగా సక్సెస్‌ అవ్వడం ఖాయం అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.

పవన్ కోసం ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా అంటున్న సీనియర్ హీరోయిన్ ఖుష్బు..!!