ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది.

శరత్ చంద్రారెడ్డి నానమ్మ మృతిచెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నానమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు శరత్ చంద్రారెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు రూ.2 లక్షల పూచీకత్తుపై 14 రోజుల బెయిల్ ఇస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.

పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ నెలకే రూ.19 లక్షలు సంపాదిస్తున్న మహిళ..!!