ఢిల్లీ కోర్టులో శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి బెయిల్ ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

శరత్ చంద్రారెడ్డి నానమ్మ మరణించారని, ఈ మేరకు తాత్కాలిక బెయిల్ ఇప్పించాలని పిటిషన్ లో విన్నవించారు.

ఈ క్రమంలో ఆయన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టులో రేపు వాదనలు జరగనున్నాయి.

కాగా మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.కేసులోని నిందితులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు..: ఎంపీ లక్ష్మణ్