సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెరువు మండల కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు,పోలీస్ అధికారులు,గిరిజన సంఘం నాయకులు స్థానిక లంబాడ ప్రజలు హాజరై భోగ్ బండారు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు,బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని,సేవాలాల్ సూచించిన మార్గంలో నడవాలని కోరారు.

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సామాజిక విప్లవకారుడని, మూఢనమ్మకాలని నమ్మకూడదని ప్రబోధించారని గుర్తు చేశారు.

విభిన్నంగా ఉన్న జాతుల్ని అయన ఏకం చేసి ఐక్యతను చాటారని చెప్పారు.గిరిజనులందరూ సన్మార్గంలో నడుస్తూ మద్యానికి,దూరంగా ఉండి గిరిజన సంస్కృతిని కాపాడాలని కోరారు.

వైరల్ వీడియో: ఛాంపియన్స్‌ ఇన్ ఇండియా .. టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ వెల్​కమ్..