రణబీర్ తోనే సందీప్ రెడ్డి నెక్స్ట్ సినిమా… వచ్చే ఏడాదిలోనే

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగా.

మొదటి చిత్రంతోనే టాలీవడ్ ఇండస్ట్రీని అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు నెక్స్ట్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ చేశాడు.

అక్కడ కూడా కబీర్ సింగ్ తో సాలిడ్ హిట్ కొట్టాడు.ఈ సినిమా తర్వాత తెలుగులో షుగర్ ఫ్యాక్టరీ పేరుతో సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అతనికి ఒకే చెప్పాడు.తరువాత చాలా మంది స్టార్స్ తో చేయాలని అనుకున్నాడు.

అయితే తెలుగులో వర్క్ అవుట్ కాకపోవడంతో హిందీలో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేశాడు.

టి-సిరీస్ తో ఒప్పందం చేసుకొని రణబీర్ కపూర్ తో ఓ బోల్డ్ కంటెంట్ కాంటెంపరరీ స్టోరీని తెరకెక్కించాలని అనుకున్నాడు.

అయితే అతని సినిమా ఎనౌన్స్ చేసే లోపే కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ రావడంతో సైలెంట్ అయిపోయాడు.

మళ్ళీ ఇప్పుడు అతని సినిమా తెరపైకి వచ్చింది.ప్రస్తుతం రణబీర్ కపూర్ హిందీలో రెండు సినిమాలు చేస్తున్నాడు.

బ్రహ్మాస్త్ర, షంషేర్ సినిమాలు రణబీర్ లిస్టులో ఉన్నాయి.ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో సందీప్ ఇప్పట్లో తెలుగు ప్రాజెక్ట్ చేసే అవకాశం లేదని టాక్ నడుస్తుంది.

ఒక వేళ చేసిన తానే నిర్మాతగా మినిమమ్ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

మరి సందీప్ నెక్స్ట్ సినిమాని హిందీలోనే చేస్తాడా, లేక తెలుగులో చేస్తాడా అనేది అతను క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.

సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీ.. వేసవి తాపాన్ని తీర్చడానికే కాదు దీనితో మరెన్నో లాభాలు!