కబీర్ సింగ్ నిర్మాతలతో మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్న దర్శకుడు

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాతో ఊహించని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా తో ఓ వైపు విజయ్ దేవరకొండ స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకోగా, దర్శకుడు సందీప్ రెడ్డి కూడా మంచి హైప్ సొంతం చేసుకొని నిర్మాతల ద్రుష్టిని ఆకర్షించాడు.

ఇక ఊహించని విధంగా అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ ని తెరకెక్కించే అవకాశం సందీప్ రెడ్డికి రావడంతో అక్కడికి జంప్ అయిపోయాడు.

ఇక కబీర్ సింగ్ తో ఏకంగా బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

ఇప్పటికి అక్కడ ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో నడుస్తుంది.కబీర్ సింగ్ విజయంతో అక్కడి నిర్మాతలని కూడా ఆకట్టుకున్న సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలని కూడా మెప్పించినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో సందీప్ తో కబీర్ సింగ్ నిర్మాతలు మరో సినిమాని తీసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే సందీప్ రెడ్డి ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా తెలుగులో ఉంటుందని అది కూడా చాలా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీస్తున్న అని గతంలో చెప్పాడు.

కేజీఎఫ్ కంటే గొప్పగా ఆ సినిమా ఉండబోతుంది అని కూడా స్పష్టం చేసాడు.

ఈ నేపధ్యంలో కబీర్ సింగ్ నిర్మాతలు ఇచ్చిన ఆఫర్ ని ఈ దర్శకుడు ఎంత వరకు ఒప్పుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే దర్శకుడు సందీప్ మాత్రం తన నెక్స్ట్ సినిమా తెలుగు, హిందీ బై లింగ్వల్ మూవీగా ప్లాన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

కోటీశ్వరుడిని చూసి బిచ్చగాడు అనుకున్న బాలుడు.. డాలర్ డొనేట్ చేయడంతో..?