మలయాళంపై సామ్ కన్ను.. అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

ఈమె కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వరుస ఫోటో షూట్ మాత్రం ఆపడం లేదు.

ఎప్పుడు కాళీ దొరికినా ఫోటో షూట్స్ లో పాల్గొంటూ.వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

ఈమె ఫోటో షూట్స్ తో ప్రతి నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఒకవైపు బికినీ వేసుకుని ఘాటు అందాలు చూపిస్తూనే మరోవైపు భారతీయ స్త్రీ అంటే ఇలానే ఉండాలి అనే విధంగా కూడా తన దుస్తులను ఎంపిక చేసుకుని అందరిని ఆకట్టు కుంటుంది.

ఇక ఈమె ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.ఇన్ని సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

అలాగే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె మలయాళం ఇండస్ట్రీ పై కన్నేసిందని వార్తలు వస్తున్నాయి.

ఈమె నటించిన సినిమాలు కొన్ని మలయాళంలో డబ్ అయ్యాయి కానీ ఇప్పటి వరకు డైరెక్ట్ సినిమా అయితే చేయలేదు.

కానీ ఇప్పుడు ఈమె మలయాళం లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

"""/"/ ఈమె ఒక మలయాళం ప్రాజెక్ట్ పై సైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

మాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాష్ పింక్ పోలీస్ అనే టైటిల్ తో ఒక సినిమా చేయనున్నాడు.

ఇందులో సమంత ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుని ఆమెకు కథ కూడా వినిపించారట.

సామ్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్28, సోమవారం 2024