శాకుంతలం సినిమా పై సమంత అభిమానుల కంగారు
TeluguStop.com
సమంత అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం శాకుంతలం.
సమంత హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయి చాలా నెలలు అవుతుంది.
ఆయినా కూడా ఇప్పటి వరకు విడుదల తేదీకి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
దర్శకుడు గుణశేఖర్ గత కొంత కాలంగా ఈ సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.
భారీ అంచనాల నడుమ దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే దాదాపు 8 సంవత్సరాల క్రితం రుద్రమ దేవి సినిమా తో గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మళ్లీ ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల చేయలేదు.రుద్రమదేవి సినిమా కూడా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల పాటు తెరకెక్కించాడు.
అంత భారీగా తెరకెక్కించిన ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది.రుద్రమదేవి సినిమా గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు చేసిన గుణశేఖర్ అదే తరహాలో శాకుంతలం సినిమా కు కూడా భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పలు ప్రపంచ దేశాలకు చెందిన వీఎఫ్ఎక్స్ కంపెనీలతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
గుణశేఖర్ కి గ్రాఫిక్స్ విషయంలో చాలా పట్టుదల ఉన్నాడు.అందుకే రుద్రమదేవి సినిమా విషయంలో చాలా ఆలస్యం జరిగింది.
ఎక్కువ సమయం తీసుకున్నా కూడా రుద్రమదేవి సినిమా అద్భుతమైన అవుట్ పుట్ గా తీసుకు రాలేదు అనేది విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా సమయం తీసుకుంటున్నారు. """/"/ దిల్ రాజు నిర్మాతగా ఉండి కూడా విడుదల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయక పోవడం పై సమంత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్రాఫిక్స్ కోసం మరీ ఇంత టైం కేటాయించడం.గుణశేఖర్ తీసుకున్న నిర్ణయం పట్ల సమంత అభిమానులు ఆందోళనతో ఉన్నారు.
ఈ ఏడాది లో ఈ సినిమా విడుదల ఉందా అనేది సమంత అభిమానులకు పెద్ద ప్రశ్నగా మారింది.
ఇక్కడ కరెన్సీ నోట్లను కూరగాయల్లాగా అమ్మేస్తారు.. వీడియో చూస్తే..