జీవితంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని తెలుసు.. సామ్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తో పాటు, కెరీర్ పరంగా కూడా దూసుకుపోతోంది.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, అదే విధంగా తన పెట్స్ గురించి తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అలాగే ఆమె టూర్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా సమంత చేసిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సమంతకు, దర్శకురాలు నందిని రెడ్డి కి మధ్య ఉన్న సంబంధం గురించి మనందరికీ తెలిసిందే.

జబర్దస్త్ సినిమాతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.అలా అప్పటి నుంచి వారిద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు.

నేడు నందినీరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సమంతా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.నందిని రెడ్డి తనకు ధైర్యాన్నీ ఇస్తూ తనను ప్రోత్సహించింది అని చెప్పుకొచ్చింది సమంత.

అలాగే తాజాగా సమంత జిమ్ లో వర్కవుట్ లకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చింది.

"""/"/ ఆమె జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నపుడు తన పెట్స్ హష్, సాషా లు చేసిన అల్లరి గురించి చెబుతూ ఒక పోస్ట్ చేసింది.

ఈ మేరకు సమంత ఇన్ స్టా స్టోరీ లో ఒక వీడియోని షేర్ చేసింది.

అందులో తన పెట్స్ చేస్తున్న అల్లరి గురించి వివరించింది.హష్ తన వద్దకు వచ్చి చాలా ఏళ్లు అవుతుందని, సాషా ఈ మధ్యనే తన వద్దకు వచ్చింది అని తెలిపింది.

హష్, సాషాల మధ్య మొదట్లో అంత స్నేహం ఉండేది కాదని, కొన్ని రోజుల తరువాత రెండూ కలిసిపోయాయంటూ సమంత చెప్పుకొచ్చింది.

ఇక ఇప్పుడు అవి కొట్టుకుంటున్న విషయాన్ని చూపెట్టింది.జీవితంలో సిబ్లింగ్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు.

అంటూ సమంత చెప్పుకొచ్చింది.వెంటనే అవి మళ్లీ కలిసిపోయాయని కూడా సమంత తెలిపింది.

ఛీ.. ఛీ.. ఫోన్ కోసం మరీ ఇంత దిగజారాలా?!