ఆ హిట్ సినిమా సీక్వెల్ కోసం జత కట్టబోతున్న భార్యాభర్తలు

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో సమంత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగులో స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు జత కట్టింది.

ఇక తన మొదటి సినిమా హీరో అయిన నాగ చైతన్యతో ప్రేమాయణం నడిపించి చివరికి పెళ్లితో ఒకటయ్యారు ఇక పెళ్లి తర్వాత సమంత హీరోయిన్ గా సత్తా చాటుతుంది.

మళ్ళీ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో భార్యాభర్తలు ఇద్దరు జోడీ కట్టబోతున్నారు పెళ్ళి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మజిలీ చిత్రంలో నటించారు.

ఈ సినిమా ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని సాధించింది.గౌతమ్ మీనన్ ఈ మధ్య తన పాత సినిమాలకి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడు.

అందులో భాగంగా ముందుగా ఏమాయ చేసావే సినిమా తీయాలని భావిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్ పై త్రిష, శింబు కలయికలో ఒక చిన్న షార్ట్ ఫిలిం టైపులో తీసి ఫాన్స్ కి సిగ్నల్ ఇచ్చాడు.

ఈ నేపధ్యంలో చైతూ, సమంతతో తెలుగు వెర్షన్ కి కూడా గౌతమ్ మీనన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు తెలియదు.

పుష్ప 2 స్టోరీ ఇదేనా..? పుష్ప క్యారక్టర్ కి రానా కి మధ్య సంబంధం ఏంటి..?