Samantha : సద్గురు ఇషా సెంటర్ లో జాయిన్ అయిన సామ్.. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందా?

హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇటీవల శాకుంతలం( Shaakuntalam ) సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గారు నిలిచింది.దీంతో అభిమానులు తదుపరి సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

సమంత తాజాగా నటించిన చిత్రం ఖుషి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.

మరోవైపు హిందీలో సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.

అందుకు సంబందించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది సమంత. """/" / గత కొద్ది రోజులుగా ఈమె మయూసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఓ వైపు అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరొకవైపు సినిమాలను పూర్తి చేసింది.

ఇది ఇలా ఉంటే సినిమాలు అన్నీ పూర్తి కావడంతో ఇప్పుడు తన హెల్త్ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది సమంత.

ముందులాగే ఎంతో ఎనర్జిటిక్ గా ఉండేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగానే తాజాగా సద్గురు ఇషా సెంటర్ లో జాయిన్ అయ్యింది.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇంస్టాగ్రామ్( Instagram ) ఖాతాలో షేర్ చేసింది.

ఆహ్లాదకరమైన వాతావరణం లో ధ్యానం చేస్తూ కనిపించింది.సెంటర్ నుంచి కొన్ని ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

"""/" / అలాగే ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది.ధ్యానంతో తనలో శక్తిని నింపుకుంటున్నట్టు తెలిపింది.

ఆ నోట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది సమంత.కొద్దిసేపటి కింద ఆలోచనలు లేకుండా నిశ్చలంగా కూర్చోవడం, ఎలాంటి కుదుపు, డిస్టబెన్స్ , కదలికలు లేకుండా ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది.

ఈరోజు ధ్యాన స్థితి నాలో శక్తికి అత్యంత శక్తివంతమైన మూలంగా, ప్రశాంతతగా మారింది.

ఈ ప్రక్రియ ఇంత సింపుల్‌గా ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని అనుకోలేదు అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మూడింటిని వాటర్ లో కలిపి నిత్యం తీసుకుంటే మీ శరీరంలో సగం రోగాలు పరారవుతాయి!