విడాకుల తర్వాత తొలిసారి అక్కడ కనిపించనున్న సామ్.. తారక్ కోసం రిస్క్ చేస్తూ?

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన తర్వాత యాడ్ షూటింగ్ లో పాల్గొంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

సమంత గత నెలలో తాత్కాలికంగా షూటింగ్ లకు ఇచ్చినా మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారని సమాచారం అందుతోంది.

చైసామ్ విడాకులకు సంబంధించి ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.విడాకుల తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

అయితే సమంత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.త్వరలో సమంత కూడా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ హోస్ట్ గా గత కొన్ని వారాల నుంచి ప్రసారమవుతున్న ఈ షోకు ఇప్పటికే రాజమౌళి, కొరటాల శివ, చరణ్ గెస్టులుగా హాజరయ్యారు.

"""/"/ తారక్ ఈ షోకు సమంతను రప్పించే ప్రయత్నం చేస్తున్నారని బోగట్టా.ఎన్టీఆర్, సమంత కలిసి ఏకంగా నాలుగు సినిమాలలో నటించారు.

ఆ నాలుగు సినిమాల్లో బృందావనం, జనతా గ్యారేజ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, సమంత కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

"""/"/ సమాజ సేవను ఎంతో ఇష్టపడే సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తన వంతు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

సమంత నటిస్తున్న సినిమాల షూటింగ్ లు ఇప్పటికే పూర్తి కాగా ఆమె కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే సమంత ఈ షోకు హాజరవుతున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.విడాకుల ప్రకటన తర్వాత వార్తల్లో నిలిచిన సమంత తారక్ షో కోసం రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి.

పులికి వణుకు పుట్టించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్‌..