తనపై జరుగుతున్న ట్రోల్స్ విషయంలో ఫ్యాన్స్ ని వారించిన సల్మాన్ ఖాన్

గత కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన బాలీవుడ్ లో సెగలు రేపుతున్న సంగతి తెలిసిందే.

ఇక సుశాంత్ సింగ్ మరణానికి కారణం బాలీవుడ్ లో ఉన్న వారసత్వం, ఆధిపత్యం అని చాలా మంది సెలబ్రిటీ ప్రముఖులు మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు.

ఇందులో ముఖ్యంగా కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఖాన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.

సుశాంత్ విషయంలో సల్మాన్ ఖాన్ గతంలో వ్యవహరించిన తీరుని మళ్ళీ బయటకి తీస్తూ అతనికి సినిమాలు లేకుండా పోవానికి, అతను మానసికంగా కృంగిపోవడానికి సల్మాన్ ఖాన్ కారణం అని అతని మీద విమర్శలు చేస్తున్నారు.

అదే సమయంలో సుశాంత్ సింగ్ అభిమానులు, అతని మరణాన్ని తట్టుకోలేని వాళ్ళు సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలతో ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఈ సమయంలో కొంత మంది సల్మాన్ ఖాన్ ఫాన్స్ సుశాంత్ పైన, అతని అభిమానుల మీద రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

ఈ విషయంలో సల్మాన్ ఖాన్ దృష్టికి రావడంతో అతను ట్విట్టర్ ద్వారా అభిమానులకి విజ్ఞప్తి చేశారు.

సుశాంత్ అభిమానులు చేస్తున్న, విమర్శలు, శాపాలు పట్టించుకోవద్దని, వాళ్ళు కేవలం బాధతో అలాంటి వాఖ్యలు చేస్తున్నారని, వీలైతే వారికి అండగా ఉండాలని, అలాగే సుశాంత్ మరణంతో మానసిక వేదన అనుభవిస్తున్న అతని కుటుంబానికి బాసటగా నిలబడాలని కోరారు.

సల్మాన్ ఈ వాఖ్యలతో సుశాంత్ అభిమానులు కూడా అతనిని కొంత వరకు టార్గెట్ చేయడం తగ్గించారు.

ఏపీలో రెండోరోజు పెన్షన్‎దారుల కష్టాలు..!