‘సలార్’ బడ్జెట్ అంతనా.. నీల్ ఈసారి అంత ఖర్చు పెట్టించాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు సరికదా మరింత పెరుగుతుంది.

ఆదిపురుష్ సినిమా ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఈయన క్రేజ్ ఎంత మాత్రం తగ్గడం లేదు.

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో భారీ నష్టాలు వచ్చాయి.అయినప్పటికీ ఇప్పుడు అతి త్వరలోనే ప్రభాస్ నుండి రాబోతున్న నెక్స్ట్ సినిమాకు కూడా దీనికి మించిన బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.

ఈ రోజు ఈ సినిమా నుండి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) టీజర్ రిలీజ్ చేసారు.

ఈ టీజర్ తో అంచనాలు డబల్ చేసాడు.ఒక్క టీజర్ తోనే సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పాడు.

"""/" / ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబందించిన బిజినెస్ గురించి క్రేజీ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాకు తెలుగు స్టేట్స్ లోనే భారీ బిజినెస్ కు నాంది పలుకుతున్నారని ఒక్క తెలుగు హక్కులే 200 కోట్లకు పైగా మేకర్స్ కోట్ చేస్తున్నట్టు టాక్.

దీంతో తెలుగులో బిగ్గెస్ట్ బిజినెస్ నంబర్ సలార్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"""/" / ప్రస్తుతానికి బిజినెస్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు కానీ అతి త్వరలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.

మరి ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ జరుగుతుందో చూడాలి.కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

ఆ విషయంలో అప్పట్లో పూరి జగన్నాథ్ కి చాలా క్రేజ్ ఉండేదా..?