వైసీపీకి సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై సజ్జల స్పందన

వైఎస్ఆర్ సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

వైఎస్ జగన్ పార్టీకి శాశ్వత అధ్యక్షునిగా లేరన్నారు.జీవితకాల అధ్యక్ష తీర్మానాన్ని ఆయన తిరస్కరించారని చెప్పారు.

ప్రస్తుతం ఆ తీర్మానం అమలులో లేదన్న సజ్జల.ఐదేళ్ల కాలానికి మాత్రమే జగన్ అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు.

ఐదేళ్ల తర్వాత మళ్లీ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియపరుస్తామని వెల్లడించారు.

ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని