ఏం మాట్లాడతాడో అర్థం కాదు ..పవన్ అరుపులు పై సజ్జల సెటైర్లు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు శ్రమదానం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు మరమ్మతుల కార్యక్రమాన్ని.జనసేన పార్టీ శ్రేణులు చేపట్టనున్నాయి.

ఈ నేపథ్యంలో.ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ పై  కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

విషయంలోకి వెళితే శ్రమదానం అనే కార్యక్రమం.గుంతల దగ్గర ఫోటోలు దిగటానికి అంటూ సెటైర్లు వేశారు.

వేరే రాష్ట్రంలో ఉండి ఎప్పుడో నాలుగు నెలలకో మూడు నెలలకో.బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఏదో చెబుతుంటాడు అది కూడా ఏమీ అర్థం కాదు.

జనంలో ఉండాలి అంటూ చురకలంటించారు.ఆయనేదో కార్యక్రమం చేస్తున్నారని భయపడాల్సిన, ఉలికిపడల్సినా అవసరం ఏమీ లేదని ఏదో రెడీ యాక్షన్ కెమెరా స్టార్ట్ అన్న తరహాలో ఫోటోలకు ఫోజులు ఇచ్చ రాజకీయ పార్టీ ఏదైనా చేస్తున్నారంటూ పవన్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనీ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

 రాజకీయ పార్టీ కాబట్టి మూడు నెలలకో నాలుగు నెలలకో ప్రజలలోకి ఈ విధంగా వచ్చి ఫోటోలకి ఫోజులు ఇచ్చి వెళ్లిపోతారు, అతనికి పెద్దగా పట్టించుకోనవసరం లేదని సెటైర్లు వేశారు.

నేడు కేసీఆర్ బస్సు యాత్ర .. ఎక్కడ జరగబోతోందంటే ..?