గోదావరి జిల్లాలో టిడిపి సరికొత్త కుట్ర అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి..!!

వైసిపి పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.

మతాల మధ్య గొడవలు సృష్టించడానికి రాష్ట్రంలో దేవాలయాలలో విగ్రహాలు పగలగొట్టారని, అది పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో గోదావరి జిల్లాలో సరికొత్త కుట్ర కి టిడిపి రెడీ అయ్యిందని ఊహించని కామెంట్లు చేశారు.

మేటర్ లోకి వెళ్తే కాపు -దళితుల మధ్య గొడవలు సృష్టించడానికి గోదావరి జిల్లాలను చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్నారని అన్నారు.

గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కాపులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వంగవీటి రంగా అదేవిధంగా దళితులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయని వాటిని ధ్వంసం చేయటానికి చంద్రబాబు రెడీ అయ్యారని ఆరోపించారు.

మతాల మధ్య గొడవలు అయిపోయాయి.ఇప్పుడు కులాల మధ్య గొడవలు సృష్టించడానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్యలు లేవనెత్తడానికి చంద్రబాబు రెడీ అయ్యారని స్పష్టం చేశారు.

కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.  """/"/.

పోస్ట్ స్టడీ వీసా రూట్‌ను కొనసాగించాల్సిందే .. యూకే ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక