చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఏపీలో మరో రెండు వారాలలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ క్రమంలో పెన్షన్ పంపిణీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి.
ఏప్రిల్ మొదటి తారీకు వాలంటీర్లు( Volunteers ) పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
దీంతో ఆ సమయంలో వృద్దులు అనేక కష్టాలు పడ్డారు.ఇదే సమయంలో అధికార పార్టీ విపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం జరిగింది.
కాగా ఇప్పుడు మే మొదటి తారీకు వస్తూ ఉండటంతో మళ్ళీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం( Pension Distribution ) జరగాల్సిన ఉండటంతో పొలిటికల్ వాతావరణం మరింత వేడెక్కింది.
"""/"/
ఇప్పటికే పెన్షన్ లబ్ధిదారుల ఎకౌంటుల్లో డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Sajjala Ramakrishna Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఆయన ముఠా కారణంగా పెన్షనర్లు అవస్థలు పడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు( Chandrababu ) మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావడం లేదు.