తెలుగు డైరెక్టర్‌కు నో చెప్పిన ఫిదా బ్యూటీ

ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

వరుసబెట్టి సినిమాలు చేయడమే కాకుండా వాటిని సూపర్‌హిట్‌గా మలచడంలోనూ సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంది.

ఇక ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో విరాట పర్వం అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు మరో సినిమా ఆఫర్ కూడా సాయి పల్లవికి వచ్చిపడ్డట్లు తెలుస్తోంది.

దర్శకుడు తేజ ఈ మధ్య చాలా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసిన తేజ, ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో పడ్డాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం సాయి పల్లవికి ఇవ్వాలని దర్శకుడు తేజ భావించాడు.

కానీ గోపీచంద్ ప్రస్తుతం ఉన్న ఫాంలో ఆయనతో సినిమా చేసేందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదట.

దీంతో తేజ ఆఫర్‌కు ఫిదా బ్యూటీ నో చెప్పినట్లు తెలుస్తోంది.ఇక ఈ బ్యూటీ నో చెప్పడంతో గోపీచంద్ సినిమాలో వేరే హీరోయిన్‌ను ఫిక్స్ చేసే పనిలో పడ్డాడట తేజ.

ఇందుకోసం కాజల్, అనుష్క లాంటి హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.కాగా సాయి పల్లవి మాత్రం ప్రస్తుతం ఫాంలో ఉన్న డైరెక్టర్స్, హీరోల సినిమాలకే పచ్చజెండా ఊపుతు తనదైన మార్క్ వేసుకోవాలని చూస్తోంది.

మరి తేజ-గోపీచంద్ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?