మొటిమల కోసం ఆ క్రీములు వాడానన్న సాయిపల్లవి.. కానీ..?

టాలీవుడ్ లో తన నటన ద్వారా సాయిపల్లవి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు సినిమాసినిమాకు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తెలుగులో నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.

సాయిపల్లవి క్రేజ్ వల్ల కూడా సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.ఈ నాచురల్ బ్యూటీ ముఖంపై మొటిమలు ఉన్నా ఎంతో అందంగా కనిపిస్తారు.

సాయిపల్లవి ముఖంపై మొటిమలు ఉంటేనే ఆమె అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు.అయితే తాజాగా ఒక సందర్భంలో తన మొటిమల గురించి మాట్లాడుతూ సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖంపై మొటిమలు రావడంతో మిగతా అమ్మాయిలలా తాను కూడా కలవరపడ్డానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

,/br """/"/ మొటిమల కోసం ఎన్నో క్రీములను తాను వినియోగించానని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే మలయాళం ప్రేమమ్ సినిమాలో నటించిన సమయంలో అభిమానులు తనను మొటిమలతోనే రిసీవ్ చేసుకున్నారని ఆ తర్వాత తాను ఆత్మస్థైర్యాన్ని మించిన అందం లేదని అర్థం చేసుకున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

"""/"/ ఈ రెండు సినిమాల్లో సాయిపల్లవి భిన్నమైన పాత్రలను పోషిస్తూ ఉండటం గమనార్హం.

ఈ రెండు సినిమాలు లాక్ డౌన్ నిబంధనల సడలింపులు అమలులోకి వచ్చాక రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

సాయిపల్లవి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమాలోని సారంగదరియా పాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న తొలిసినిమా లవ్ స్టోరీ కావడం గమనార్హం.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్… ఓకే చెప్పిన అల్లు అర్జున్?