పిల్లలకి గోరింటాకు పెట్టి ముచ్చట పడ్డ సాయి పల్లవి
TeluguStop.com
ఫిదాతో తెలుగు ప్రేక్షకులందరిని ఫిదా చేసిన అందాల భామ సాయి పల్లవికి టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది.
ఆమె సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా ఎదగడానికి వచ్చిన అవకాశాలని సాయి పల్లవి ఆఫ్ట్రాల్ అన్నట్లు తీసి పారేసింది.
కేవలం తన మనసుకి నచ్చే సినిమాలే హీరోలతో సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్తుంది.
ప్రస్తుతం ఈ భామ తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ, అలాగే వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాలు చేస్తుంది.
ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ ఓ మలయాళీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.
ఈ షూటింగ్ నిమిత్తం సాయి పల్లవి ఉత్తర్ప్రదేశ్లోని పిప్రీలో ఉంది.అయితే షూటింగ్ గ్యాప్ లో సాయి పల్లవి సమీప గ్రామంలోని చిన్నారులతో సరదాగా సమయం గడిపింది.
వాళ్ల అరచేతులను మెహందీ డిజైన్లతో నింపి, పిల్లల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను షేర్ చేసి హ్యాపీ క్లైంట్స్, పిప్రీ పిల్లాస్ అనే క్యాప్షన్తో పాటు హార్ట్ ఎమోజీలను సాయి పల్లవి జతచేసింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సాయి పల్లవి చేసిన ఈ పనికి సెలబ్రెటీలు ఫిదా అయిపోయారు.
ఈ ఫోటోలపై స్టార్ హీరోయిన్ సమంత సో క్యూట్ అంటూ కామెంట్ చేసింది.
మరో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ సైతం సాయిపల్లవి పోస్టులకు లైక్ చేసింది.సామాజిక అంశాలపై స్పందించే సాయిపల్లవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం, ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లనే కాదు సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
కూటమి పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం ?