చైతూతో మరోసారి జోడీ కట్టనున్న సాయి పల్లవి.. ఫ్యాన్స్ ఎదురు చూపులు!

ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి.మొదటి సినిమా తోనే ఆకట్టుకునే అందం, అదిరిపోయే అభినయంతో అందరిని ఫిదా చేసిన బ్యూటీ ఎవరో అందరికి తెలుసు.

న్యాచురల్ బ్యూటీ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న భామ సాయి పల్లవి ( Sai Pallavi ).

ఇప్పుడు సాయి పల్లవి అంటే పేరు కాదు.బ్రాండ్ అనే స్థాయికి ఈమె చేరుకుంది.

సౌత్ ఇండస్ట్రీ లోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

కానీ చేసింది కొన్నే అయినా క్రేజ్ మాత్రం భారీగానే వచ్చింది.ఈమె సినిమాలో ఉంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తేలిపోవాల్సిందే.

అయితే సాయి పల్లవి తన కెరీర్ డల్ అవుతుంది అని ఏ అవకాశాన్ని బడితే ఆ అవకాశాన్ని ఒప్పుకోకుండా సినిమాలోని పాత్ర నచ్చితేనే ఓకే చెప్పడం వంటివి చేయడం వల్ల తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది.

"""/" / ఇక సాయి పల్లవి చివరిసారిగా నటించిన సినిమా ''గార్గి'( Gargi )'.

ఈ సినిమా తర్వాత మళ్ళీ తన నుండి ఏ సినిమా అప్డేట్ అయితే రాలేదు అనే చెప్పాలి.

అయితే ప్రస్తుతం సాయి పల్లవి శివకార్తికేయన్ ( Sivakarthikeyan )తో ఒక సినిమా చేస్తుంది.

ఈ సినిమా మినహా మరో సినిమా ఒప్పుకోలేదు.అయితే తెలుగు ప్రేక్షకులు ఈ భామ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

"""/" / తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగ చైతన్య (Naga Chaitanya ) - చందు మొండేటి (Chandoo Mondeti ) కాంబోలో ( Naga Chaitanya Chandoo Mondeti Movie ) తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా నటించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ కాంబో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది.

మరి ఈసారి అయినా ఈ భామ ఈ సినిమాకు ఓకే చెబుతుందా లేదా అనే సందేహంలో ఆమె ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

కూతురి పెళ్లిరోజు ఈ తండ్రి ఎంత సాహసం చేశాడో తెలిస్తే..