ఆలు లేదు చూలు లేదు ..సీత పాత్రలో సాయి పల్లవి అంటూ జోరు ప్రచారం

సాయి పల్లవి.నటనకి మేటి అయినప్పటికి మంచి ప్రవర్తన తోనే అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంది.

కానీ గత సినిమాల పరాజయాల కారణం గా ఆమె పని అయిపొయింది అని అంత అనుకుంటున్నారు.

అసలు ఈ మధ్య కాలంలో ఆమెకు సంబందించిన వార్తలు మీడియాలో కనిపించడం లేదు.

అలాగే ఆమెకు సినిమాలు లేవని, నిర్మాతలు పిలవడం లేవని ఏవేవో కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

అంతే కాదు ఆమె ఎలాగూ డాక్టర్ కాబట్టి ఆమె సినిమాలు పక్కన పెట్టి ఆసుపత్రి కట్టి అందులో ప్రాక్టీస్ చేయబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి.

అందులో ఎలాంటి తప్పు లేదు ఆమె గతంలో చాల సార్లు తనకు ఇక్కడ స్థానం లేకపోతే ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్పేసింది.

అయితే వివాదాస్పద వ్యాఖ్యలు ఆ వాతావరణంలో ఆమె ఉండలేను అంటూ ఆమె పలుమార్లు చెప్పింది.

ఆమె మంచి నటి, మంచి పాత్రల్లో నటిస్తుంది.ఒక గొప్ప ఛాలెంజింగ్ పాత్ర వస్తే ఆమె చాల గొప్పగా నటించగలదు.

కానీ ఇప్పటి వరకు ఆమెకు తన కెరీర్ లో అసలు అలాంటి ఒక ఛాలెంజింగ్ పాత్ర అయితే లభించలేదు.

శ్యామ్ సింగ రాయ్, ఫిదా, గార్గి, విరాట పర్వం వంటి సినిమాలు ఆమెకు ఒక జుజుబీ పాత్రలే.

ఆమె ఇంకా అంతకంటే గొప్పగా నటించగలదు.ఆమెలోని నటనకు తగిన పాత్ర దొరికి ఆమెను పూర్తిగా ఆవిష్కరించగలిగితే అది నిజంగా ఆమె అదృష్టమే.

ఇక ఇప్పుడు తాజాగా ఒక వార్త బాగా సోషల్ మీడియా లో వినిపిస్తుంది.

"""/"/ హ్రితిక్ రోషన్ రావణుడిగా, రణభీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణం అనే బాలీవుడ్ ప్రాజెక్ట్ కి సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

కానీ నిజానికి ఆమెకు అలాంటి ఒక పాత్ర ఇప్పటి వరకు కంఫర్మ్ కాలేదు కానీ, ఆమెను ఖచ్చితంగా తీసుకోవాలని మాత్రం టీమ్ భావిస్తున్నారట.

అయితే ఈ బాలీవుడ్ రామాయణం సినిమా అనే వార్త వింటుంటే ఖచ్చితంగా నవ్వాల్సిందే.

ఎందుకంటే అక్కడ వారికి పౌరాణికం తీయడమే రాదు.పైగా బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్ సినిమా ఫలితం మనం చూసాం.

ఇక సీత పాత్రకు రామాయణం లో ఎంతో స్కోప్ ఉంటుంది.మరి ఇన్ని క్యాలుక్యులేషన్స్ చూసాక సాయి పల్లవి ఆ పాత్రలో నటిస్తే సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.

అక్కవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ